ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 30 ఏండ్ల నుంచి వర్షపు నీటినే తాగుతున్నాడు ఆ వ్యక్తి. వర్షపు నీటినే తాగుతున్నా అతడికి ఇప్పటి వరకు చిన్న ఆరోగ్య సమస్య కూడా రాలేదు. షాకింగ్ గా అనిపిస్తున్నా ఇది అక్షరాలా నిజం. పదండి ఇంకాస్త ముందుకెళ్దాం.
ఆయన పేరు పొన్నాడ
వసంత్ కుమార్. వయసు 60 కి పైనే. అంటే 63 ఏళ్లు. తెలంగాణలోని సంగారెడ్డి ఆయన ఊరు.
సంగారెడ్డిలోనే బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అక్కడే సెటిల్ కూడా
అయ్యాడు. అయితే... వసంత్ కుమార్ 30 ఏళ్ల నుంచి వర్షపు నీటినే తాగుతున్నాడు.
ఆయనొక్కడే తన ఫ్యామిలీ మొత్తం వర్షపు నీటినే తాగుతారట. 30 ఏళ్ల నుంచి వర్షపు నీరు
తాగుతున్నా కూడా తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదని చెబుతున్నాడు వసంత్ కుమార్.
అయితే.. వర్షపు
నీటిని వీళ్లు ఎలా తాగుతారంటే.. ముందు వర్షం పడే సమయంలో నీటిని పట్టుకొని నిల్వ
చేసుకుంటారు. వర్షాకాలంలో పడ్డ వర్షాన్ని వృథా కానీయకుండా పట్టుకొని నిల్వ
చేసుకుంటారు. వర్షపు నీటిని పైపుల ద్వారా డాబా మీద ఉన్న డ్రమ్ముల్లో నింపుతారు. ఆ
డ్రమ్ముల నుంచి ఇంట్లో ఉన్న నల్లా ద్వారా నీటిని పట్టుకొని తాగుతారు.
అయితే..
డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేసే సమయంలో అందులో ఒక టీ స్పూన్ స్ఫటికాన్ని వేసి
డ్రమ్ము మూత పెడతారు. ఆ తర్వాత ఆ నీటిని నల్లా ద్వారా పట్టుకొని రాగి బిందెల్లో
పోసుకొని తాగుతారు.
ఒకవేళ వర్షపు నీరు
అయిపోతే మున్సిపల్ నీరు లేదా బోరు నీటిని శుద్ధి చేసుకొని తాగుతారట వసంత్. వాన నీటిలో
రోగ నిరోధక శక్తి ఎక్కువుంటుందని.. వెనుకట ఆయన నాన్న కూడా అవే నీళ్లు తాగేవారని..
అందుకే ఇప్పుడు తను కూడా అవే నీటిని తాగి ఆరోగ్యం ఉన్నామని చెప్పారు వసంత్.
ఏది ఏమైనా మినరల్
వాటర్ పేరుతో మినరల్స్ అన్ని తీసేసి ఉత్త నీళ్లను అమ్మి ప్రజలకు లేనిపోని రోగాలు
సృష్టిస్తున్న ఈరోజుల్లో వృథాగా పోతున్న వాననీటిని ఒడిసి పట్టుకొని తాగి పదిమందికి
ఆదర్శంగా నిలుస్తున్న వసంత్ కుమార్ ను మనం అభినందించాల్సిందే.
Comments
Post a Comment