ఇంటి పైన సహజ పద్ధతిలో ఆర్గానిక్ స్ట్రాబెర్రీ , గ్రేప్స్ పండిస్తున్న పూణే మహిళ.. ఆమె సలహాలు మీరూ తీసుకోండి
ఈరోజుల్లో అంతా కల్తీ. ఏం తిందామన్నా కల్తీ. చివరకు కూరగాయలు, పండ్లు కూడా కల్తీ అయిపోయాయి. ఎన్నో రకాల కెమికల్స్ కలిపి ఇప్పుడు కూరగాయలు, పండ్లను పండిస్తున్నారు. అవి తింటే ఓ బాధ.. తినకపోతే ఇంకో బాధ. ఏం చేస్తాం.. కలికాలం అంటూ చూస్తూ కూర్చోవడం కంటే.. మనమే సహజమైన పండ్లను పండించుకుంటే పోలా.. అదిరిపోలా.. అని అనుకున్నది ఓ మహిళ. అనుకున్నదే తడువుగా వెంటనే తన ఇంటి మిద్దె పైన అన్నిరకాల పండ్లను సహజమైన పద్ధతుల్లో పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది.
ఆమె పేరు సుజాత నాఫడె. వయసు 45. ఊరు మహారాష్ట్రలోని పూణె. ఆమె ఇప్పుడు
కాదు.. 2008 నుంచే తన ఇంటి మిద్దె పైన రకరకాల పండ్ల చెట్లను పెంచడం ప్రారంభించారు.
70 రకాల పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలను పెంచుతున్నారావిడ.
నిజానికి సుజాత వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి
వ్యవసాయాన్ని చూస్తూ పెరిగారు. అందుకే తనకు కూడా వ్యవసాయం మీద ఉన్న మక్కువతో
పెళ్లయ్యాక కూడా తన ఇంటి మిద్దె పైన రకరకాల పండ్లను పండిస్తూ అందరి ప్రశంసలు
అందుకుంటున్నారు.
ఏడేళ్ల క్రితం తన ఫ్రెండ్ ఒకరు కేరళ నుంచి తీసుకొచ్చి ఒక గ్రేప్
మొక్కను గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక.. ఆ చెట్టును పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు
గ్రేప్స్ కాస్తూనే ఉన్నదట. సంవత్సరానికి మూడు సార్లు గ్రేప్స్ కాస్తాయట. వాళ్ల
ఫ్యామిలీకే కాదు.. బంధువులకు కూడా గ్రేప్స్ ను ఇస్తారట.
ఏ చెట్టు పెంచాలన్నా కూడా దాని గురించి ఎక్కువగా ఏం తెలియాల్సిన పని
లేదు. ఆ చెట్టును ఒక కుండీలో కానీ.. మట్టి ఉన్న ప్రాంతంలో కానీ నాటాక.. దానికి
ప్రతి రోజు కావాల్సినంత నీళ్లను పట్టడంతో పాటుగా... చెట్లకు ఎంతో బలాన్ని ఇచ్చే
ఎండిపోయిన ఆకుల మిశ్రమం, కూరగాయల వ్యర్థాలు, పేడ, నల్లరేగడి మట్టి, జీవామృతం
లాంటివి వేస్తు ఉంటే అవి చక్కగా పెరిగి మంచిగా కాస్తాయని ఆమె సలహాలు ఇస్తున్నారు. అయితే ఎక్కువగా పండ్లు, కూరగాయల చెట్లను
వర్షాకాలంలో నాటుకుంటే అవి చనిపోకుండా.. బతకడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.. అని
సుజాత చెబుతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇంటి మీద కానీ.. ఇంటి పక్కన కానీ.. ఖాళీ స్థలం
ఉంటే వెంటనే అన్ని రకాల పండ్లను సహజంగా పండించుకొని హాయిగా తినేయండి.
(దిబెటర్ ఇండియా సౌజన్యంతో)
Comments
Post a Comment