విమానం తయారు చేయడానికి అమ్మ పుస్తెలతాడును తాకట్టు పెట్టాడు.. మొదటిసారి ఇండియాలో విమానాన్ని తయారుచేసి రికార్డు సృష్టించాడు.. సక్సెస్ స్టోరీ
పైనుంచి విమానం వెళ్తుంటే మనం ఏం చేస్తాం.. అబ్బ.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలి అని అనుకుంటాం. ఇంకొందరు ఆ విమానాన్ని ఒక్కసారైనా నడపాలి అని అనుకుంటారు. కానీ.. మహారాష్ట్రకు చెందిన అమోల్ యాదవ్ మాత్రం జీవితంలో ఒక్కసారైనా విమానాన్ని తయారు చేయాలి అని అనుకున్నాడు. అనుకోవడమే కాదు.. దాని మీద ఎంతో శ్రమించాడు.. చివరకు సక్సెస్ అయ్యాడు. తొలిసారిగా ఇండియాలో విమానాన్ని తయారుచేసి రికార్డు సృష్టించాడు.
అమోల్ యాదవ్ ది
ముంబై. అమోల్ జెట్ ఎయిర్ వేస్ విమానాలకు పైలెట్ గా పనిచేశాడు. 19 ఏళ్లకే కమర్షియల్
పైలెట్ ట్రెయినింగ్ కోసం యూఎస్ వెళ్లాడు. పైలెట్ శిక్షణ కూడా పూర్తి చేసుకున్న
అమోల్ కు సొంతంగా ఎందుకు విమానం తయారు చేయకూడదు.. అనే ఆలోచన వచ్చింది. ఆలోచన
రావడమే కాదు.. దాన్ని ఎలాగైనా చేసి చూపించాలనుకున్నాడు.
తర్వాత ఇండియాకు
వచ్చాడు. వెంటనే తన ఆలోచనను తన ఫ్యామిలీతో పంచుకున్నాడు. వెంటనే తన పని ప్రారంభించాడు.
తన ఇంటి స్లాబ్ పైన్నే ల్యాబ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే విమానాలు తయారు
చేయడం ప్రారంభించాడు. ఓసారి విమానం తయారు చేయడానికి డబ్బులు తక్కువైతే తన అమ్మ
మంగళసూత్రం అమ్మి విమానం ఇంజన్ కొన్నాడు. ఇలా.. ఆర్థికంగానూ విమానం తయారు
చేయడానికి అమోల్ ఎంతో కష్టపడ్డాడు.
1998లోనే రెండు
సీట్లు ఉండే విమానాన్ని తయారు చేశాడు. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది సక్సెస్
కాలేదు. మరోసారి 1999లో విమానాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. 2003లో దాన్ని
తయారు చేయడం పూర్తి చేశాడు. కాకపోతే అది కూడా సక్సెస్ కాలేదు. అయినా.. తన
పట్టుదలను మాత్రం అమోల్ కోల్పోలేదు.
2010లో మరో
విమానాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. దానికి టీఏసీ003 అని పేరు పెట్టాడు.
మొత్తానిక 2016 లోపు దాన్ని తయారు చేశాడు. అదే సంవత్సరం దేశ ప్రధాని మోదీ మేక్ ఇన్
ఇండియా నినాదాన్ని బలంగా తీసుకెళ్లారు. ఆ సమయంలోనే మేకిన్ ఇండియా ప్రదర్శనలో తన
విమానాన్ని పెట్టాడు. ఇండియాలో విమానాన్ని తయారు చేయడంతో.. దానికి మంచి గుర్తింపు
వచ్చింది.
కాకపోతే దాన్ని
నడపడానికి కావాల్సిన అనుమతులు మాత్రం అమోల్ కు రాలేదు. డీజీసీఏ వాళ్లు అనుమతులు
ఇవ్వలేదు. దీంతో ఈ విషయాన్ని అమోల్.. అప్పటి మహారాష్ట్ర సీఎం దృష్టికి
తీసుకెళ్లడంతో వెంటనే సీఎం.. ప్రధాని మోదీతో మాట్లాడారు. దీంతో అమోల్ కు మోదీని
కలిసే అవకాశం లభించింది.
తొలి విజయం
అప్పుడు మోదీని
అమోల్ కలిసి తన ప్రాజెక్టు గురించి వివరించాడు. మోదీ కూడా మెచ్చుకొని... వెంటనే తన
విమానానికి కావాల్సిన అనుమతులను ఇప్పించారు.
మొత్తానికి అన్ని
అనుమతులు రావడంతో స్వదేశంలో తయారైన మొట్టమొదటి విమానం ఆకాశంలో విహరించింది. ఈ
విమానంలో పైలెట్ తో పాటు ఆరుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఈ విమానం మాగ్జిమమ్
185 నాట్స్ వేగంతో దూసుకెళ్తుంది.
థ్రస్ట్ ఎయిర్ క్రాఫ్ట్
ప్రస్తుతం అమోల్
థ్రస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే కంపెనీని ఏర్పాటు చేశాడు. త్వరలో 19 సీట్ల కెపాసిటీ
ఉండే విమానాన్ని తయారు చేయబోతున్నాడట. దాని కోసం ఓ టీమ్ ను కూడా ఏర్పాటు
చేసుకొని.. స్వదేశంలో విమానాలు తయారు చేసి చరిత్ర సృష్టించబోతున్నాడు అమోల్.
First "MADE IN INDA" Aircraft designed by Captain Amol Shivaji Yadav of Jet Airways. Shabhash! pic.twitter.com/Gat08acKo8
— CDR. BB Khilari (@bbkhilari) August 18, 2020
Comments
Post a Comment