Skip to main content

వలస కార్మికుడి కూతురు.. యూనివర్సిటీ టాపర్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది..!

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారు... తరతరాలకు చెరగని వెలుగవుతారు.. అని ఓ కవి ఊరికనే అనలేదు. మన బ్యాక్ గ్రౌండ్ ఏదైనా కానీ.. మనం ఎక్కడి నుంచైనా రానీ.. తినడానికి తిండి లేకున్నా.. కట్టుకోవడానికి బట్టలు లేకున్నా.. అందరూ ఛీ.. అన్నా థూ.. అన్నా.. తిట్టినా.. కొట్టినా.. చివరకు ఎవ్వరూ పట్టించుకోకున్నా.. నీలో ఎదగాలి అనే కసి ఉంటే చాలు.. చదవాలి అనే కసి ఉంటే చాలు. నిన్ను ఇక ఆ దేవుడు దిగి వచ్చినా ఆపలేరు.. అనేది నిష్టూరమైన సత్యం.. అని తెలియజెప్పింది ఈ అమ్మాయి.


ఆమె తండ్రి వలస కార్మికుడు. ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్లాలి. ఆ ఊరు ఈ ఊరు అని కాకుండా అన్ని ఊర్లు తిరగాలి. రాష్ట్రాలు దాటాలి. కానీ.. తన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆ తండ్రి ఆరాటపడ్డాడు. పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్లాడు. తన కూతురును కష్టపడి చదివించాడు. దీంతో తన కూతురు బాగా చదువుతుందిలే అని అనుకున్నాడు కానీ.. తన కూతురు ఏకంగా యూనివర్సిటీ టాపర్ అవుతుందని ఏనాడూ ఊహించలేదు.

కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీఏ ఆర్కియాలజీ బ్రాంచ్ లో 85 శాతం మార్కులు సాధించి ఆ అమ్మాయి యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది. దీంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. ఆ అమ్మాయి పేరు పాయల్. తనను ఆ స్థాయికి తీర్చిదిద్దిన తన తండ్రి పేరు ప్రమోద్ కుమార్. వాళ్ల సొంతూరు బీహార్. కానీ.. పాయల్ కు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే కేరళకు వలస వెళ్లిపోయారు.


కేరళలోని ఎర్నాకుళంలో స్థిరపడ్డారు. ఆ తర్వాత తన పిల్లలను మంచిగా చదివించడం కోసం ప్రమోద్ కుమార్ ఎంతో కష్టపడ్డాడు. పాయల్ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండటంతో పాయల్ చదువుపై కొంచెం శ్రద్ధ కనపరిచాడు ప్రమోద్. ఎస్ఎస్సీ బోర్డులోనూ పాయల్ 85 శాతం మార్కులు తెచ్చుకున్నది. 12వ బోర్డులోనూ 95 శాతం మార్కులు తెచ్చుకున్నది. ఇప్పుడు బీఏలో ఏకంగా యూనివర్సిటీ టాపర్ గా నిలిచి తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకునేలా చేసింది.

ఎలాగైనా సివిల్ సర్వీసెస్ రాసి ఐఏఎస్ కావాలన్నదే మా తల్లిదండ్రుల కల. వాళ్ల కలను నేను నెరవేరుస్తాను. ఇన్నేళ్లు వాళ్లు నా చదువు కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పటి నుంచి వాళ్లు కష్టపడకుండా నేను చూసుకుంటాను.. అంటూ కన్నీటిపర్యంతం అయింది పాయల్.

Comments

Popular posts from this blog

వాళ్లంతా ట్రాన్స్ జెండర్స్.. కానీ ఒకరి దగ్గర చేయి చాపలేదు.. కరోనా టైమ్ లోనూ సొంతంగా పచ్చడి బిజినెస్ పెట్టి సక్సెస్ సాధించారు

ట్రాన్స్ జెండర్ లేదా నపుంసకులు లేదా హిజ్రాలు... అంటేనే ఈ సమాజంలో చిన్నచూపు. వాళ్లు ఎవరైనా డబ్బులు అడుక్కోవడానికి వస్తే.. ఛీ..ఛీ.. అని అంటాం. ఓ 10 రూపాయలు ఇవ్వడానికి సందేహిస్తాం. ఏదైనా పనిచేసుకొని చావొచ్చుగా.. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని గులుగుతాం. నిజానికి.. వాళ్లు డబ్బులు అడుక్కోవడానికి ఓ కారణం ఉంది. వాళ్లకు ఎవరూ పని ఇవ్వరు. అందుకే వాళ్లు అడుక్కొని తమ జీవనం సాగిస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న తంతే. కాకపోతే ఈమధ్య కరోనా వచ్చి అందరి జీవితాలు అతలాకుతలం అయ్యాయి కదా. అందరిలాగే వాళ్ల జీవితాలు కూడా కుదేలయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. బయటికి వెళ్లే అవకాశం లేదు. తిండికి పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఏం చేయాలి.. డబ్బులు అడుక్కుందామన్నా బయట నరమానవుడు కనిపించడం లేదు. కనిపించినా.. కరోనా భయం ఒకటి.. కరోనా వల్ల పనుల్లేక అందరూ ఉంటే.... వాళ్లకు డబ్బులు ఎవరు ఇస్తారు.. దీంతో ఒక పూట తిండికి కూడా నోచుకోని హిజ్రాలు ఎందరో సరే.. ఇప్పుడు మనం అసలు టాపిక్ కు వచ్చేద్దాం.. కరోనా సమయంలో తిండి లేక చద్దామా? లేక ఏదైనా పని కల్పించుకొని నాలుగు రాళ్లు వెనకేసుకుందామా? అని గట్టిగా నిర్ణయించుకున్నారు హైద

45 ఏళ్లుగా ఖరీదైన వైద్యానికి కూడా 5 రూపాయలే తీసుకుంటున్న డాక్టర్ గురించి మీకు తెలుసా?

  వైద్యం అంటేనే వ్యాపారం అయింది ఈరోజుల్లో. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నా వైద్యం చేయరు. డాక్టర్లు సరిగ్గా ఉండరు. కొన్ని చోట్ల అసలు సౌకర్యాలే ఉండవు. ఇంకొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డబ్బులు ముట్టచెప్పనిదే వైద్యం అందదు. ఇక కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిందే. కట్టుబట్టలతో బయటికి పంపిస్తాయి కార్పొరేట్ ఆసుపత్రులు. రోజూ ఎన్ని చూస్తున్నాం మనం. కానీ.. అందరూ అలాగే ఉంటారా? అందరు డాక్టర్లు వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారా? అంటే కాదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఓ డాక్టర్... కేవలం 5 రూపాయలకే ఖరీదైన వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. అది 45 ఏళ్ల నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరివద్దా ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోకుండా వైద్యాన్ని అందిస్తున్న ఆ మహానుభావుడి గురించి తెలుసుకోవాల్సిందే మనం. ఆయన పేరే వి. తిరువేంగడం. వయసు 70. ఊరు చెన్నై. అక్కడ 5 రూపాయల డాక్టర్ అని ఎవరిని అడిగినా కళ్లు మూసుకొని చెబుతారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అలా ఉంటది అక్కడ. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. తమిళ్ హీరో విజయ్ నటించిన అదిరింది సినిమా గుర్తుందా మీకు. ఆ సినిమాలో విజయ్ ఓ డాక్టర్. 5 రూపా

30 ఏండ్ల నుంచి వర్షపు నీటినే తాగుతున్నాడు.. చిన్న ఆరోగ్య సమస్య కూడా లేదు

  ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 30 ఏండ్ల నుంచి వర్షపు నీటినే తాగుతున్నాడు ఆ వ్యక్తి. వర్షపు నీటినే తాగుతున్నా అతడికి ఇప్పటి వరకు చిన్న ఆరోగ్య సమస్య కూడా రాలేదు. షాకింగ్ గా అనిపిస్తున్నా ఇది అక్షరాలా నిజం. పదండి ఇంకాస్త ముందుకెళ్దాం. ఆయన పేరు పొన్నాడ వసంత్ కుమార్. వయసు 60 కి పైనే. అంటే 63 ఏళ్లు. తెలంగాణలోని సంగారెడ్డి ఆయన ఊరు. సంగారెడ్డిలోనే బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అక్కడే సెటిల్ కూడా అయ్యాడు. అయితే... వసంత్ కుమార్ 30 ఏళ్ల నుంచి వర్షపు నీటినే తాగుతున్నాడు. ఆయనొక్కడే తన ఫ్యామిలీ మొత్తం వర్షపు నీటినే తాగుతారట. 30 ఏళ్ల నుంచి వర్షపు నీరు తాగుతున్నా కూడా తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదని చెబుతున్నాడు వసంత్ కుమార్. అయితే.. వర్షపు నీటిని వీళ్లు ఎలా తాగుతారంటే.. ముందు వర్షం పడే సమయంలో నీటిని పట్టుకొని నిల్వ చేసుకుంటారు. వర్షాకాలంలో పడ్డ వర్షాన్ని వృథా కానీయకుండా పట్టుకొని నిల్వ చేసుకుంటారు. వర్షపు నీటిని పైపుల ద్వారా డాబా మీద ఉన్న డ్రమ్ముల్లో నింపుతారు. ఆ డ్రమ్ముల నుంచి ఇంట్లో ఉన్న నల్లా ద్వారా నీటిని పట్టుకొని తాగుతారు. అయితే.. డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేస