కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారు... తరతరాలకు చెరగని వెలుగవుతారు.. అని ఓ కవి ఊరికనే అనలేదు. మన బ్యాక్ గ్రౌండ్ ఏదైనా కానీ.. మనం ఎక్కడి నుంచైనా రానీ.. తినడానికి తిండి లేకున్నా.. కట్టుకోవడానికి బట్టలు లేకున్నా.. అందరూ ఛీ.. అన్నా థూ.. అన్నా.. తిట్టినా.. కొట్టినా.. చివరకు ఎవ్వరూ పట్టించుకోకున్నా.. నీలో ఎదగాలి అనే కసి ఉంటే చాలు.. చదవాలి అనే కసి ఉంటే చాలు. నిన్ను ఇక ఆ దేవుడు దిగి వచ్చినా ఆపలేరు.. అనేది నిష్టూరమైన సత్యం.. అని తెలియజెప్పింది ఈ అమ్మాయి.
ఆమె తండ్రి వలస
కార్మికుడు. ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్లాలి. ఆ ఊరు ఈ ఊరు అని కాకుండా అన్ని
ఊర్లు తిరగాలి. రాష్ట్రాలు దాటాలి. కానీ.. తన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని
ఆ తండ్రి ఆరాటపడ్డాడు. పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్లాడు. తన కూతురును కష్టపడి
చదివించాడు. దీంతో తన కూతురు బాగా చదువుతుందిలే అని అనుకున్నాడు కానీ.. తన కూతురు
ఏకంగా యూనివర్సిటీ టాపర్ అవుతుందని ఏనాడూ ఊహించలేదు.
కేరళలోని
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీఏ ఆర్కియాలజీ బ్రాంచ్ లో 85 శాతం మార్కులు సాధించి ఆ
అమ్మాయి యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది. దీంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. ఆ
అమ్మాయి పేరు పాయల్. తనను ఆ స్థాయికి తీర్చిదిద్దిన తన తండ్రి పేరు ప్రమోద్ కుమార్.
వాళ్ల సొంతూరు బీహార్. కానీ.. పాయల్ కు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే కేరళకు వలస
వెళ్లిపోయారు.
కేరళలోని
ఎర్నాకుళంలో స్థిరపడ్డారు. ఆ తర్వాత తన పిల్లలను మంచిగా చదివించడం కోసం ప్రమోద్
కుమార్ ఎంతో కష్టపడ్డాడు. పాయల్ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండటంతో పాయల్
చదువుపై కొంచెం శ్రద్ధ కనపరిచాడు ప్రమోద్. ఎస్ఎస్సీ బోర్డులోనూ పాయల్ 85 శాతం
మార్కులు తెచ్చుకున్నది. 12వ బోర్డులోనూ 95 శాతం మార్కులు తెచ్చుకున్నది. ఇప్పుడు
బీఏలో ఏకంగా యూనివర్సిటీ టాపర్ గా నిలిచి తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకునేలా
చేసింది.
ఎలాగైనా సివిల్
సర్వీసెస్ రాసి ఐఏఎస్ కావాలన్నదే మా తల్లిదండ్రుల కల. వాళ్ల కలను నేను
నెరవేరుస్తాను. ఇన్నేళ్లు వాళ్లు నా చదువు కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పటి నుంచి
వాళ్లు కష్టపడకుండా నేను చూసుకుంటాను.. అంటూ కన్నీటిపర్యంతం అయింది పాయల్.
Comments
Post a Comment