Skip to main content

అంకితభావం అంటే ఇది.. 86 కిలోల నుంచి 62 కిలోలకు తగ్గిన నటి విద్యుల్లేఖ రామన్ శ్రమ, కన్నీరు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

అంకితభావం అంటే ఏంటి? శ్రమ, పట్టుదల, కష్టపడేతత్వం అంటే ఏంటి? విజయానికి వాటికి ఏంటి సంబంధం.. అంటే ఖచ్చితంగా వాటి మధ్య సంబంధం ఉంది అనే చెప్పుకోవాలి.




నీలో కష్టపడేతత్వం, పట్టుదల, అంకితభావం ఉంటేనే విజయం నీకు బానిస అవుతుంది. లేదంటే ఓటమి నిన్ను వెతుక్కుంటూ వస్తూనే ఉంటుంది. ఓటమి ఎప్పుడూ నీదగ్గరే ఉంటుంది. అది ఏ పని అయినా.. చివరకు బరువు తగ్గాలన్నా కూడా పట్టుదలతో శ్రమిస్తే బరువు తగ్గడం పెద్ద కష్టం కాదని నిరూపించింది నటి విద్యుల్లేఖ రామన్.



ఆమె సినిమాల్లో ఎలా కనిపించేదో అందరం చూశాం. చాలా లావుగా ఉండేది. అలా లావుగా ఉండటం వల్ల తను ఎన్నో చేదు అనుభవాలను చవి చూసింది. తన బరువే తనకు సమస్యగా మారుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న బరువుతో ఎన్నో సమస్యలను అనుభవించింది.



ఇంతలోనే కరోనా రావడం.. లాక్ డౌన్ విధించడంతో షూటింగులన్నీ ఆగిపోయాయి. అప్పుడు తనకు చాలా సమయం దొరికింది. దీంతో వెంటనే తను డిసైడ్ అయిపోయింది. ఈ లాక్ డౌన్ సమయాన్ని మంచిగా ఉపయోగించుకొని కష్టపడి వ్యాయామం చేసి 20 కిలోలు తగ్గింది. అది పట్టుదల అంటే.. అది శ్రమ అంటే.

ఈ సుదూర ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. ఎన్నో కష్టాలు. వాటన్నింటినీ దిగమింగుకొని.. వ్యాయామం మీదే శ్రద్ధ పెట్టి.. 20 కిలోలు తగ్గి ఇప్పుడు ఎంతో నాజూకుగా తయారైంది విద్యుల్లేఖ. అది అంకితభావం అంటే.

చాలామంది లావుగా ఉన్నాం.. మేం ఇక సన్నగా కాలేము అంటూ తమలో తామే కుమిలిపోతుంటారు... కుమిలిపోవడమే కాదు.. ఆత్మన్యూనతా భావంతో కూడా ఉంటారు. అటువంటి వాళ్లు విద్యుల్లేఖను ఆదర్శంగా తీసుకోండి.. వెంటనే స్ఫూర్తి పొందుతారు.. ఈ ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. నువ్వు బలంగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది.. జరిగి తీరుతుంది.


Comments

Popular posts from this blog

వాళ్లంతా ట్రాన్స్ జెండర్స్.. కానీ ఒకరి దగ్గర చేయి చాపలేదు.. కరోనా టైమ్ లోనూ సొంతంగా పచ్చడి బిజినెస్ పెట్టి సక్సెస్ సాధించారు

ట్రాన్స్ జెండర్ లేదా నపుంసకులు లేదా హిజ్రాలు... అంటేనే ఈ సమాజంలో చిన్నచూపు. వాళ్లు ఎవరైనా డబ్బులు అడుక్కోవడానికి వస్తే.. ఛీ..ఛీ.. అని అంటాం. ఓ 10 రూపాయలు ఇవ్వడానికి సందేహిస్తాం. ఏదైనా పనిచేసుకొని చావొచ్చుగా.. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని గులుగుతాం. నిజానికి.. వాళ్లు డబ్బులు అడుక్కోవడానికి ఓ కారణం ఉంది. వాళ్లకు ఎవరూ పని ఇవ్వరు. అందుకే వాళ్లు అడుక్కొని తమ జీవనం సాగిస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న తంతే. కాకపోతే ఈమధ్య కరోనా వచ్చి అందరి జీవితాలు అతలాకుతలం అయ్యాయి కదా. అందరిలాగే వాళ్ల జీవితాలు కూడా కుదేలయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. బయటికి వెళ్లే అవకాశం లేదు. తిండికి పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఏం చేయాలి.. డబ్బులు అడుక్కుందామన్నా బయట నరమానవుడు కనిపించడం లేదు. కనిపించినా.. కరోనా భయం ఒకటి.. కరోనా వల్ల పనుల్లేక అందరూ ఉంటే.... వాళ్లకు డబ్బులు ఎవరు ఇస్తారు.. దీంతో ఒక పూట తిండికి కూడా నోచుకోని హిజ్రాలు ఎందరో సరే.. ఇప్పుడు మనం అసలు టాపిక్ కు వచ్చేద్దాం.. కరోనా సమయంలో తిండి లేక చద్దామా? లేక ఏదైనా పని కల్పించుకొని నాలుగు రాళ్లు వెనకేసుకుందామా? అని గట్టిగా నిర్ణయించుకున్నారు హైద

45 ఏళ్లుగా ఖరీదైన వైద్యానికి కూడా 5 రూపాయలే తీసుకుంటున్న డాక్టర్ గురించి మీకు తెలుసా?

  వైద్యం అంటేనే వ్యాపారం అయింది ఈరోజుల్లో. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నా వైద్యం చేయరు. డాక్టర్లు సరిగ్గా ఉండరు. కొన్ని చోట్ల అసలు సౌకర్యాలే ఉండవు. ఇంకొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డబ్బులు ముట్టచెప్పనిదే వైద్యం అందదు. ఇక కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిందే. కట్టుబట్టలతో బయటికి పంపిస్తాయి కార్పొరేట్ ఆసుపత్రులు. రోజూ ఎన్ని చూస్తున్నాం మనం. కానీ.. అందరూ అలాగే ఉంటారా? అందరు డాక్టర్లు వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారా? అంటే కాదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఓ డాక్టర్... కేవలం 5 రూపాయలకే ఖరీదైన వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. అది 45 ఏళ్ల నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరివద్దా ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోకుండా వైద్యాన్ని అందిస్తున్న ఆ మహానుభావుడి గురించి తెలుసుకోవాల్సిందే మనం. ఆయన పేరే వి. తిరువేంగడం. వయసు 70. ఊరు చెన్నై. అక్కడ 5 రూపాయల డాక్టర్ అని ఎవరిని అడిగినా కళ్లు మూసుకొని చెబుతారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అలా ఉంటది అక్కడ. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. తమిళ్ హీరో విజయ్ నటించిన అదిరింది సినిమా గుర్తుందా మీకు. ఆ సినిమాలో విజయ్ ఓ డాక్టర్. 5 రూపా

30 ఏండ్ల నుంచి వర్షపు నీటినే తాగుతున్నాడు.. చిన్న ఆరోగ్య సమస్య కూడా లేదు

  ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 30 ఏండ్ల నుంచి వర్షపు నీటినే తాగుతున్నాడు ఆ వ్యక్తి. వర్షపు నీటినే తాగుతున్నా అతడికి ఇప్పటి వరకు చిన్న ఆరోగ్య సమస్య కూడా రాలేదు. షాకింగ్ గా అనిపిస్తున్నా ఇది అక్షరాలా నిజం. పదండి ఇంకాస్త ముందుకెళ్దాం. ఆయన పేరు పొన్నాడ వసంత్ కుమార్. వయసు 60 కి పైనే. అంటే 63 ఏళ్లు. తెలంగాణలోని సంగారెడ్డి ఆయన ఊరు. సంగారెడ్డిలోనే బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అక్కడే సెటిల్ కూడా అయ్యాడు. అయితే... వసంత్ కుమార్ 30 ఏళ్ల నుంచి వర్షపు నీటినే తాగుతున్నాడు. ఆయనొక్కడే తన ఫ్యామిలీ మొత్తం వర్షపు నీటినే తాగుతారట. 30 ఏళ్ల నుంచి వర్షపు నీరు తాగుతున్నా కూడా తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదని చెబుతున్నాడు వసంత్ కుమార్. అయితే.. వర్షపు నీటిని వీళ్లు ఎలా తాగుతారంటే.. ముందు వర్షం పడే సమయంలో నీటిని పట్టుకొని నిల్వ చేసుకుంటారు. వర్షాకాలంలో పడ్డ వర్షాన్ని వృథా కానీయకుండా పట్టుకొని నిల్వ చేసుకుంటారు. వర్షపు నీటిని పైపుల ద్వారా డాబా మీద ఉన్న డ్రమ్ముల్లో నింపుతారు. ఆ డ్రమ్ముల నుంచి ఇంట్లో ఉన్న నల్లా ద్వారా నీటిని పట్టుకొని తాగుతారు. అయితే.. డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేస